సూపర్ స్టార్ మహేశ్ బాబు తల్లి ఇందిరాదేవి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో ఆమె ఇంటికే పరిమితమయ్యారు.
కొద్దిరోజులుగా ఆరోగ్యం క్షీణించడంతో AIG ఆసుపత్రిలో చేర్చించారు. ఈక్రమంలోనే తెల్లవారుజామున 4 గంటలకు ఆమె తుదిశ్వాస విడిచారు.
కాగా ఈఏడాది జనవరిలోనే మహేశ్ బాబు సోదరుడు రమేశ్ బాబు కూడా అనారోగ్యంతో కన్నుమూశారు. దీంతో ఒకే ఏడాదిలో సూపర్ స్టార్ ఇంట్లో రెండు తీవ్ర విషాదాలు చోటుచేసుకున్నాయి.
సూపర్ స్టార్ కృష్ణకు ఇందిరా దేవి మొదటి భార్య కాగా.. వీరికి మహేష్, రమేష్, మంజుల, ప్రియుదర్శిని, పద్మావతి జన్మించారు.
కాగా కృష్ణ రెండో భార్య విజయ నిర్మల , హీరో నరేష్ తల్లి గారు 2019 లో చనిపోయిన సంగతి తెలిసిందే.
ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల నుండి అభిమానులు సందర్శన కోసం ఆమె పార్ధివదేహాన్ని పద్మాలయ స్టూడియోలో ఉంచి అనంతరం మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరపనున్నారు తెలియ వచ్చింది .

